Numbers 16

1లేవీ మునిమనవడు, కహాతు మనవడు, ఇస్హారు కొడుకు కోరహు, రూబేనీయుల్లో ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాము, పేలెతు కొడుకు ఓనుతో కలిసి 2ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి 3మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. <<మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవాాా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవాాా వారి మధ్య ఉన్నాడు. యెహోవాాా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?>> అన్నారు.

4మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో, 5<<ఆయన వారు ఎవరో యెహోవాాా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవాాా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరకు చేర్చుకుంటాడు.

6కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవాాా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి. 7అప్పుడు యెహోవాాా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు>> అన్నాడు.

8ఇంకా మోషే కోరహుతో, <<లేవీ కొడుకులారా వినండి, 9తన మందిరసేవ చెయ్యడానికి యెహోవాాా మిమ్మల్ని తన దగ్గరకు చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా? 10ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు. 11దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాాాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాాాకు లోబడినవాడు>> అన్నాడు.

12అప్పుడు మోషే ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు. 13కాని వారు, <<మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా? 14అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని గుడ్డివారిగా చేస్తావా? మేము రాము>> అన్నారు.

15అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాాాకు చెప్తూ, <<నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు>> అన్నాడు. 16అప్పుడు మోషే కోరహుతో, <<నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవాాా సన్నిధిలో నిలబడాలి. 17మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకు వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవాాా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి>> అని చెప్పాడు.

18కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు. 19కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరకు తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవాాా మహిమ సమాజమంతటికీ కనిపించింది.

20అప్పుడు యెహోవాాా, <<మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి. 21తక్షణమే నేను వారిని కాల్చేస్తాను>> అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు, 22వారు సాగిలపడి, <<దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?>> అని యెహోవాాాను వేడుకున్నారు.

23అప్పుడు యెహోవాాా మోషేకు జవాబిస్తూ, 24<<సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి>> అన్నాడు.

25అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు. 26అతడు, <<ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి>> అని ఆ సమాజంతో అన్నాడు. 27కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు.

28అప్పుడు మోషే, <<ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవాాా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు. 29మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవాాా నన్ను పంపలేదు. 30కాని, యెహోవాాా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాాాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది>> అన్నాడు.

31మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది. 32భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.

33వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు. 34వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని, <<భూమి మనలను కూడా మింగేస్తుందేమో>> అనుకుంటూ పారిపోయారు. 35అప్పుడు యెహోవాాా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది.

36అప్పుడు యెహోవాాా మోషేతో, <<నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి. 37ఆ నిప్పుని దూరంగా చల్లు. 38పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వీళ్ళ ధూపార్తులను తీసుకుని బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యాలి. వారు యెహోవాాా సన్నిధికి వాటిని తెచ్చిన కారణంగా అవి ప్రతిష్ఠితం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంటాయి.>>

39అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవరూ యెహోవాాా సన్నిధిలో ధూపం అర్పించడానికి వచ్చి, 40కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవాాా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.

41తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ <<మీరు యెహోవాాా ప్రజలను చంపారు>> అని చెప్పి, 42సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. వారు సన్నిధి గుడారం వైపు తిరిగి చూసినప్పుడు, ఆ మేఘం దాన్ని కమ్మింది. యెహోవాాా మహిమ కూడా కనిపించింది. 43మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వచ్చినప్పుడు,

44యెహోవాాా మోషేతో, <<మీరు ఈ సమాజం మధ్య నుంచి వెళ్ళి పొండి, 45తక్షణమే నేను వారిని నాశనం చేస్తాను>> అని చెప్పినప్పుడు, వారు సాగిలపడ్డారు. 46అప్పుడు మోషే, <<నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరకు వెళ్లి వారి కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి, ఎందుకంటే, యెహోవాాా సన్నిధిలోనుంచి కోపం బయలుదేరింది. తెగులు మొదలయ్యింది>> అని అహరోనుతో చెప్పాడు.

47మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెగులు మొదలై పాకిపోతూ ఉంది. కాబట్టి అతడు ధూపం వేసి ఆ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. 48అతడు చనిపోయిన వారికీ, బతికున్నవారికీ మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగింది.

49కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14,700 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరకు తిరిగి వచ్చాడు.

50

Copyright information for TelULB